ప్రపంచ ఆర్చరీ సమాఖ్య శీతల్ దేవిని (19 ఏళ్లు) 2025 సంవత్సరానికి ఉత్తమ పారా ఆర్చర్గా ఎంపిక చేసింది. జమ్ముకశ్మీర్కి చెందిన శీతల్ రెండు చేతులూ లేకపోయినా, మొక్కవోని పట్టుదలతో ఆర్చరీలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఈమె 2025లో దక్షిణ కొరియాలో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం గెలిచింది. ఈ టోర్నీలో మహిళల టీమ్ విభాగంలో రజతం, మిక్స్డ్ టీమ్లో కాంస్యం కూడా నెగ్గింది. 2024 పారిస్ పారాలింపిక్స్లోనూ మిక్స్డ్ టీమ్ కాంస్యం సాధించింది.