2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) 13% పెరిగి 50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.25 లక్షల కోట్ల)కు చేరినట్లు పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐఐటీ) పేర్కొంది.
2023-24లో ఇవి 44.42 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.78 లక్షల కోట్లు)గా ఉన్నాయి.
జనవరి- మార్చి త్రైమాసికంలో మనదేశంలోకి 9.34 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ వచ్చింది.
2024 ఇదే సమయంలోని 12.38 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈమొత్తం 24.5% తక్కువ.
అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలోనూ ఎఫ్డీఐ 5.6% తగ్గి 10.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
2024-25లో మొత్తం ఎఫ్డీఐ (ఈక్విటీలు, రీఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, ఇతర మూలధనాలు కలిపి) 81.04 బి. డాలర్లుగా నమోదయ్యాయి.
2023-24 నాటి 71.3 బి. డాలర్లతో చూస్తే ఇవి 14% ఎక్కువ.