ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) దేశ జీడీపీ 6.8% వృద్ధిని నమోదు చేయొచ్చని పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంచనా వేసింది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025-26) వృద్ధిరేటు 7.7 శాతంగా నమోదు కావచ్చని పేర్కొంది.
దీంతో 2026 నాటికి జపాన్ను అధిగమించి, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని వెల్లడించింది.