భారతదేశంలో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
ఈ 123 ఏళ్ల ఉష్ణోగ్రతల సగటు కంటే 2024లో 0.90 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైందని ఐఎండీ వివరించింది.
ఇప్పటివరకు అత్యధిక వేడి సంవత్సరంగా 2016 ఉంది. ఆ రికార్డును ఇప్పుడు 2024 బద్దలుకొట్టింది.