Published on Feb 15, 2025
Current Affairs
2024లో ‘నోటా’కు అతితక్కువ ఓట్లు
2024లో ‘నోటా’కు అతితక్కువ ఓట్లు

ఓటరు తానెవరికీ ఓటేయడం లేదని ఈవీఎం ద్వారా తెలియజేసేందుకు వీలు కల్పించిన ‘నోటా’ ఐచ్ఛికానికి 2024 లోక్‌సభ ఎన్నికలో అతితక్కువ ఓట్లు పోలయ్యాయని ఎన్నికల కమిషన్‌ తెలిపింది.  

ఈవీఎంలలో ‘నోటా’ను 2013లో ప్రవేశపెట్టారు. 2014 సాధారణ ఎన్నికల్లో నోటాకు మొత్తం పోలైన ఓట్లలో 1.08 శాతం లభించగా 2024 ఎన్నికల్లో కేవలం 0.99 శాతం లభించాయి. 

బిహార్‌లో గత ఎన్నికల్లో అత్యధికంగా 2.07 శాతం ఓట్లు ‘నోటా’కు పడ్డాయి. దాద్రా నగర్‌ హవేలి, దమన్‌ అండ్‌ దీవ్‌లో 2.06 శాతం, గుజరాత్‌లో 1.58 శాతం ఓట్లు పోలయ్యాయి. నాగాలాండ్‌లో 0.21 శాతం ఓట్లు ‘నోటా’ ఐచ్ఛికానికి పోలయ్యాయి.