అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12 దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించారు.
అఫ్గానిస్థాన్, మయన్మార్ (బర్మా), చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ ఈ జాబితాలో ఉన్నాయి.
2025, జూన్ 9 నుంచి ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయి.
బురుండీ, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్థాన్, వెనెజువెలాల నుంచి వచ్చే సందర్శకులపై ఆంక్షలను మరింత పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
జాతీయ భద్రతను, దేశ ప్రయోజనాలను పరిరక్షించేందుకే తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.