తెలంగాణలో గత ఆరేళ్లలో ఎన్నడూలేనంత తక్కువగా 2022లో ప్రతి వెయ్యిమంది బాలురకు 907 మంది అమ్మాయిలు మాత్రమే జన్మించారు.
ఈ మేరకు బాలురు, బాలికల జననాల నిష్పత్తి జాబితాలో తెలంగాణ దేశంలో దిగువ నుంచి మూడో స్థానంలో ఉంది.
తెలంగాణ తర్వాత బిహార్ (891), మహారాష్ట్ర (906)లు మాత్రమే ఉన్నాయి.
ఏపీలో ఇది 938గా నమోదైంది.
ఈ మేరకు దేశవ్యాప్తంగా 2022లో జనన, మరణాల నివేదికను కేంద్ర జనాభా లెక్కల విభాగం తాజాగా విడుదల చేసింది.
నివేదికలోని ముఖ్యాంశాలు:
2022లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బాలురు కంటే బాలికల జననాలు ఎక్కువగా ఉన్నవి మూడు మాత్రమే.
ఈ మేరకు ప్రతి వెయ్యి మంది బాలురకు.. అత్యధికంగా నాగాలాండ్లో 1,068 మంది, అరుణాచల్ప్రదేశ్లో 1,036, లద్దాఖ్లో 1,027 మంది బాలికలు జన్మించారు.
దేశంలో 2021తో పోలిస్తే 2022లో మరణాలు 102 లక్షల నుంచి 86.5 లక్షలకు తగ్గాయి. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ముందు సంవత్సరం కంటే పెరిగాయి.