Published on Nov 7, 2025
Current Affairs
100 బిలియన్‌ డాలర్ల క్లబ్బులోకి ఎస్‌బీఐ
100 బిలియన్‌ డాలర్ల క్లబ్బులోకి ఎస్‌బీఐ

మార్కెట్‌ విలువపరంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 100 బిలియన్‌ డాలర్ల  (రూ.8.8 లక్షల కోట్ల) క్లబ్బులోకి చేరింది. ఈ ఘనత సాధించిన ఆరో భారతీయ కంపెనీగా, ప్రభుత్వ రంగం నుంచి తొలి సంస్థగా నిలిచింది. 2025, నవంబరు 6న బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 1.47% పెరిగి జీవనకాల గరిష్ఠమైన రూ.971.15ను చేరింది. తద్వారా బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.8.96 లక్షల కోట్లకు (100 బి.డాలర్లకు పైగా) చేరింది.