రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (0.5%) తగ్గించి, 5.5 శాతానికి చేర్చింది. 2025లో, ఇంతకుముందే రెండుసార్లుగా 0.25% చొప్పున కోత విధించడంతో, తాజా తగ్గింపుతో కలిపి మొత్తం 1 శాతం (100 బేసిస్ పాయింట్ల) మేర రెపో రేటులో ఊరట కలిగింది. బ్యాంకులు తమ వడ్డీ రేటుకు ప్రామాణికంగా రెపోను పరిగణిస్తాయి. రెపో రేటుపై 2.5-2.75% అదనంగా వడ్డీకి రుణాలు మంజూరు చేస్తుంటాయి.