Published on Jan 7, 2026
Current Affairs
హరియాణాలో హైడ్రోజన్‌ రైలు
హరియాణాలో హైడ్రోజన్‌ రైలు

భారత్‌లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలును హరియాణా ప్రారంభించనుంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందిన ఈ రైలు జింద్‌-సోనిపత్‌ మధ్య నడుస్తుంది. ఈ రైలుకు ఇంధనం అందించడానికి జింద్‌లో హైడ్రోజన్‌ ప్లాంట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ప్రారంభం, నిర్వహణ దశలకు 11 కేవీల విద్యుత్‌ సరఫరాను ఈ ప్లాంట్‌ అంతరాయం లేకుండా అందించనుంది. దీని సామర్థ్యం 3000 కిలోగ్రాములు.