- హురున్ ఇండియా గ్లోబల్ రిచ్ లిస్ట్-2026 ప్రకారం, టెస్లా అధినేత ఎలాన్మస్క్ ప్రపంచ అగ్రగామి కుబేరుడిగా అయిదోసారీ కొనసాగారు. మస్క్ సంపద 89% పెరిగి, 792 బి.డాలర్లకు (రూ.72 లక్షల కోట్లకు పైగా) చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద 9% వృద్ధితో రూ.9.8 లక్షల కోట్లకు చేరింది. తద్వారా దేశంలోనే కాకుండా, ఆసియాలోనూ అగ్రగామి కుబేరుడిగా నిలిచారు.
- ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ మూడోస్థానంలో ఉన్నట్లు హురున్ వెల్లడించింది.