దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న 97 మంది శక్తిమంత మహిళలతో 2025 కాండెరే హురున్ ఇండియా మహిళా నాయకుల జాబితాను హురున్ విడుదల చేసింది.
ఆర్థిక, సాంకేతిక, దాతృత్వం, కళలు, అంకుర సంస్థలకు సంబంధించిన వారితో ఈ తొలి జాబితా విడుదలైంది.
ఆయా మహిళలు నేతృత్వం వహిస్తున్న కంపెనీల విలువ ఆధారంగా 10 మందితో రంగాల వారీగా జాబితా రూపొందించారు.
మహిళా వృత్తి నిపుణుల్లో శాంతి ఏకాంబరం అగ్రస్థానంలో నిలిచారు.
రూ.3.81 లక్షల కోట్ల విలువ కలిగిన కోటక్ మహీంద్రా బ్యాంక్కు ఆమె డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. రూ.1.44 లక్షల కోట్ల విలువైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్న పర్మీందర్ చోప్రా రెండో స్థానంలో ఉన్నారు.
రిలయన్స్ రిటెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈశా అంబానీ 6వ స్థానంలో ఉన్నారు.