భారత్ 2024, నవంబరు 17న తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. గగనతల రక్షణ వ్యవస్థలను బోల్తా కొట్టిస్తూ శత్రువుపై ప్రచండ వేగంతో దాడి చేయడం ఈ అస్త్రం ప్రత్యేకత. దీన్ని ఒడిశా తీరానికి చేరువలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి పరీక్షించారు.
దీంతో ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన మన దేశం చేరింది. ఈ హైపర్సోనిక్ క్షిపణి 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
ఈ క్షిపణిని హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ క్షిపణి కాంప్లెక్స్తోపాటు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన ల్యాబ్లు, పరిశ్రమలు రూపొందించాయి.