భారత ప్రభుత్వం అందించిన లైన్ ఆఫ్ క్రెడిట్ సహకారంతో మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. దాన్ని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం అవుతుందనేందుకు ఈ ఎయిర్పోర్ట్ ఒక చిహ్నమని ముయిజ్జు పేర్కొన్నారు.