మహారాష్ట్ర, ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 2025 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, సివిల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇనుస్ట్రుమెంటేషన్, పెట్రోలియం ఇంజినీరింగ్.
అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు రూ.25,000.
ఎంపిక విధానం: విద్యార్హత, షార్ట్లిస్ట్, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-01-2025.