భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్), 2026-27 సంవత్సరానికి దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
మొత్తం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు: 608
విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్.
అర్హత: సంబంధిత విభాగాల్లో 60% మార్కులతో (SC/ST/PwBD అభ్యర్థులకు 50%) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు 01-04-2023 తర్వాత ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.
వయోపరిమితి: 02-03-2026 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ-ఎన్సీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
రాష్ట్రాల వారీగా ఖాళీలు (తెలుగు రాష్ట్రాల్లో): మొత్తం ఖాళీలలో ఆంధ్రప్రదేశ్లో 62, తెలంగాణలో 22 స్థానాలు అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 114 ఖాళీలు ఉన్నాయి.
ఎంపిక విధానం: అభ్యర్థుల మెరిట్ మార్కుల ఆధారంగా స్క్రీనింగ్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం 1:5 నిష్పత్తిలో పిలుస్తారు. తుది ఎంపిక మెరిట్ జాబితా, మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా NATS 2.0 పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అనంతరం హెచ్పీసీఎల్ అధికారిక పోర్టల్ (http://jobs.hpcl.co.in/Recruit_New/recruitlogin.jsp) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం: 16-02-2026.
చివరి తేదీ: 02-03-2026.