ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత హాకీ జట్లు నెగ్గింది. 2024, సెప్టెంబరు 17న హులున్బుయిర్ (చైనా)లో జరిగిన ఫైనల్లో హర్మన్ప్రీత్ సేన 1-0తో చైనాను ఓడించింది. ఈ టైటిల్ గెలవడం భారత్కు ఇది అయిదోసారి. 2011లో తొలిసారి ఈ ట్రోఫీ గెలిచిన భారత్.. తర్వాత 2016, 2018, 2023, 2024 టోర్నీల్లోనూ విజేతగా నిలిచింది.
* ఈ టోర్నీలో జరిగిన 7 మ్యాచ్ల్లో భారత్ 26 గోల్స్ కొట్టింది. కేవలం అయిదు గోల్స్ మాత్రమే ప్రత్యర్థి జట్లకు ఇచ్చింది.