Published on Apr 8, 2025
Current Affairs
హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా పార్థసారథి
హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా పార్థసారథి

గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) వైవీఎస్‌బీజీ పార్థసారథి 2025, ఏప్రిల్‌ 7న ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా నియమితులయ్యారు.

ఈయన 1967లో కాకినాడలో జన్మించారు.

2003లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు అదనపు జడ్జిగా.. అనంతరం 2010లో నేరుగా అదనపు జిల్లా జడ్జిగా నియమితులయ్యారు.

చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూ అక్కడి నుంచి 2022లో గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.