దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ (53)కు 2024 సంవత్సర సాహితీ నోబెల్ పురస్కారాన్ని 2024, అక్టోబరు 10న ప్రకటించారు. ఆమె రచనల్లో చారిత్రక పరిణామాలు తెచ్చిపెట్టిన మనో వ్యాఘాతాలు, మానవ జీవితంలోని దుర్బలత ప్రగాఢంగా చిత్రితమవుతాయని నోబెల్ కమిటీ వివరించింది. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియా రచయిత్రి, దక్షిణ కొరియా సాహితీవేత్త హాన్ కాంగే.