భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రకు ప్రతిష్ఠాత్మక ‘ససాకవా’ పురస్కారం దక్కింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ‘డిజాస్టర్ రిస్క్ రిడక్షన్(యూఎన్డీఆర్ఆర్)’ కార్యాలయం ఆయన్ను ఈ అవార్డుతో సత్కరించింది. 2025, జూన్ 7న జెనీవాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఉష్ణమండల తుపానుల అంచనా, హెచ్చరిక వ్యవస్థలకు సంబంధించి ఆయన చేసిన కృషికిగానూ ఈ గౌరవం దక్కింది.