సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో మోదీ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ 2026, ఫిబ్రవరి 9న దిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమైన సీషెల్స్కు భారత్ రూ.1,500 కోట్ల (175 మిలియన్ అమెరికన్ డాలర్ల) ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధులతో సీషెల్స్లో అభివృద్ధి, భద్రత, మౌలిక సదుపాయాల రంగాల్లో కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నారు.
ఆరు రోజుల భారత పర్యటనలో భాగంగా మోదీతో హెర్మినీ 2026, ఫిబ్రవరి 9న విస్తృతంగా చర్చలు జరిపారు.