Published on Oct 6, 2025
Current Affairs
‘స్వస్థ నారి, సశక్త పరివార్‌’
‘స్వస్థ నారి, సశక్త పరివార్‌’

‘స్వస్థ నారి, సశక్త పరివార్‌’ కార్యక్రమం కింద దేశమంతటా 6.5 కోట్ల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా 2025, అక్టోబరు 4న తెలిపారు.

ప్రధాని నరేద్ర మోదీ 2025, సెప్టెంబరు 17న ప్రారంభించిన ఈ కార్యక్రమం అక్టోబరు 2తో పూర్తయింది. 

దీనికింద దేశమంతటా 18 లక్షల ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి 6.5 కోట్లమంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.