దేహ్రాదూన్లోని 93 సంవత్సరాల భారత సైనిక అకాడమీ చరిత్ర (ఐఎంఏ)లో సయీ ఎస్. జాదవ్ అనే మహిళా అధికారిణి శిక్షణను పూర్తి చేసుకుని భారతసైన్యంలో చేరారు. మహారాష్ట్రకు చెందిన ఈమె ప్రస్తుత బ్యాచ్లో ఏకైక మహిళా ఆఫీసర్ క్యాడెట్గా ఈ ఘనత సాధించారు.
సయీ జాదవ్ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఎస్ఎస్బీ ద్వారా ఎంపికై ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరారు. ఇక్కడ ఆరునెలల కఠినమైన సైనిక శిక్షణను పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఆమెను జెంటిల్మన్ క్యాడెట్స్ అని కాకుండా ఆఫీసర్ క్యాడెట్స్ అని పిలవనున్నారు.