ప్రభుత్వ రంగంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కొత్త ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి అశోక్ కుమార్ పాండాను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ) సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన సెయిల్లో డైరెక్టర్ (ఫైనాన్స్)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత సీఎండీ అమరేందు ప్రకాశ్ పదవీ కాలం 2026 ఏప్రిల్ 2తో ముగియనుంది.
ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఈ నియామకానికి తుది ఆమోదం తెలపాల్సి ఉంటుంది.