Published on Dec 1, 2025
Current Affairs
సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ
సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ

సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత డబుల్స్‌ స్టార్లు గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ టైటిల్‌ నెగ్గారు. 2025, నవంబరు 30న లఖ్‌నవూలో జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ గాయత్రి- ట్రీసా జోడీ 17-21, 21-13, 21-15తో కాహో ఒసావా- మయ్‌ తనాబె (జపాన్‌) జంటపై విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ రన్నరప్‌గా నిలిచాడు.