విదేశీ విపణిల్లో కార్లు, ద్విచక్ర, వాణిజ్య వాహనాలకు గిరాకీ పెరగడంతో.. 2025లో మనదేశం నుంచి 63,25,211 వాహనాలు ఎగుమతి అయ్యాయని వాహన తయారీదార్ల సంఘం సియామ్ తెలిపింది. 2024లో ఎగుమతి అయిన 50,98,474 వాహనాలతో పోలిస్తే ఇవి 24.1% అధికం. పశ్చిమాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి మన వాహనాలకు గిరాకీ స్థిరంగా లభిస్తోందని వెల్లడించింది.
మోటార్ సైకిల్ ఎగుమతులు 27% పెరిగి 43,01,927కు చేరాయి. స్కూటర్ల ఎగుమతులు 8% వృద్ధితో 6,20,241గా నమోదయ్యాయి. మొత్తం వాణిజ్య వాహనాల ఎగుమతులు 27% పెరిగి 91,759కి చేరాయి.