ఆంధ్రప్రదేశ్లోని యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సైయెంట్లతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం కీలక ఒప్పందం కుదర్చుకుంది. 2025, జూన్ 11న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో సైయెంట్ ఫౌండేషన్, ఏఐసీటీఈ ప్రతినిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విభాగం త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రధానంగా నగర ఆధారిత ఇన్నోవేషన్ క్లస్టర్లను ప్రారంభించేందుకు సైయెంట్ ఫౌండేషన్, ఏఐసీటీఈ సహకారం అందిస్తాయి. మొదట విశాఖ నుంచి ప్రారంభిస్తారు. విద్యా సంస్థల్లో వ్యాపార దృక్పథం, మేధో సంపత్తి (ఐపీ) సృష్టితోపాటు స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహిస్తారు. దీంతో విద్యా సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య సమన్వయం పెంపొందుతుంది.