Published on Dec 17, 2025
Admissions
సీయూఈటీ పీజీ 2026 ప్రవేశాలు
సీయూఈటీ పీజీ 2026 ప్రవేశాలు

కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) పీజీ అకాడమిక్ సెషన్ 2026-27 ప్రవేశాలకు సంబంధించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నోటిఫికేషన్‌ను  విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తారు.

 వివరాలు: 

సీయూఈటీ పీజీ 2026

స్పెషలైజేషన్లు:

లాంగ్వేజెస్‌

సైన్స్‌

హ్యూమానిటీస్‌

కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌

ఎంటెక్‌/హయ్యర్‌ సైన్సెస్‌

ఆచార్య

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: వయసు పరిమితి లేదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం: మల్టిపుల్‌ చాయిస్‌ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలో 74 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 90 నిమిషాలు, ప్రతి ప్రశ్నకు 4 మార్కులు, నెగటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు (2 పరీక్ష పత్రాలకు): 

జనరల్‌ అభ్యర్థులకు రూ.1400; ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీలకు రూ.1200; ఎస్సీ/ఎస్టీ/థర్డ్‌జెండర్‌ అభ్యర్థులకు రూ.1100; దివ్యాంగులకు రూ.1000.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, సిక్రిందాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌, నిజామాబాద్‌, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, కొత్తగూడేం, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, నరసరావుపేట, పొద్దుటూరు, సూరంపాలెం, నంధ్యాల, తాడేపల్లిగూడెం.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 14.01.2026.

ఆన్‌లైన్ రాత పరీక్ష: మార్చి 2026.

Website:https://examinationservices.nic.in/ExamSys2026/root/Home.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFWAbOef0JkBZzg/BVVqGR2DZDcQsil9BGw0L/dcLf/EP