నాగర్కర్నూల్ జిల్లా సోమశిల, నిర్మల్ జిల్లా ప్రధాన కేంద్రం నిర్మల్ ఉత్తమ పర్యాటక గ్రామాల పురస్కారాలను గెలుచుకున్నాయి. కేంద్ర పర్యాటకశాఖ 2024 సంవత్సరానికి ఎనిమిది కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో స్పిరిచ్యువల్-వెల్నెస్ విభాగంలో సోమశిల, క్రాఫ్ట్స్ విభాగంలో నిర్మల్ గ్రామాలు ఎంపికయ్యాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 2024, సెప్టెంబరు 27న దిల్లీలోని విజ్ఞాన్భవన్లో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, కేంద్ర పర్యాటకమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేశారు.