భారత్లో తన వ్యాపార కార్యకలాపాల సారథ్య బాధ్యతలను సమీర్ కుమార్కు అప్పగించినట్లు ఇ-కామర్స్ దిగ్గజం 2024, సెప్టెంబరు 18న అమెజాన్ ప్రకటించింది. మనీశ్ తివారీ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కంట్రీ మేనేజరుగా సమీర్ను నియమించింది. అక్టోబరు 1న ఆయన బాధ్యతలు చేపడతారని కంపెనీ వివరించింది.