Published on Jan 6, 2026
Current Affairs
‘సముద్ర ప్రతాప్‌’
‘సముద్ర ప్రతాప్‌’

‘సముద్ర ప్రతాప్‌’ నౌకను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జలప్రవేశం చేయించారు. గోవా షిప్‌యార్డ్‌లో 2026, జనవరి 5న ఈ కార్యక్రమం జరిగింది. కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా రూ.2,500 కోట్లతో గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ఈ నౌకను నిర్మించింది. సముద్ర జలాల్లో కాలుష్యాన్ని.. ముఖ్యంగా చమురు వ్యర్థాలను నిర్మూలించి జలచరాలను కాపాడేందుకు దోహదపడే అధునాతన సాంకేతికత ఇందులో ఉంది.