సముద్ర జలాలను శుద్ధి చేయడానికి అధిక పీడనంతో కూడిన దేశీయ నానో రంధ్రాల బహుళ అంచెల పాలిమెరిక్ పొరలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఆవిష్కరించింది. కాన్పుర్లోని డీఆర్డీవోకు చెందిన రక్షణ సామగ్రి స్టోర్స్, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఎంఎస్ఆర్డీఈ) ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీన్ని భారత తీర ప్రాంత రక్షణ నౌకల్లో (ఐసీజీ) వినియోగించనున్నారు. శుద్ధి చేసిన సముద్ర జలాలు.. క్లోరైడ్ అయాన్స్ ప్రభావానికి లోనైనప్పుడూ స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉండగలిగేలా ఈ ప్రక్రియను అభివృద్ధి చేసినట్లు 2025, మే 15న రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.