Published on May 19, 2025
Current Affairs
సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్‌కు నాలుగో స్థానం
సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్‌కు నాలుగో స్థానం

సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచంలోనే మనదేశం నాలుగో స్థానానికి చేరినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది.

2024-25లో మనదేశం నుంచి 130 దేశాలకు సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. 2014-15లో మన ఉత్పత్తులు తరలి వెళ్లిన దేశాల సంఖ్య 105గా ఉంది. 

2014-15లో 10.51 లక్షల మెట్రిక్‌ టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి కాగా.. 2024-25లో 16.85 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగాయి.

అధునాతన ఆక్వా పద్ధతులు, శీతల గిడ్డంగులు - రవాణా మౌలిక సదుపాయాలు పెరగడం, సాగు-నిల్వలో అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించడం వంటివి ఇందుకు దోహదపడ్డాయి.