దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న 15-24 ఏళ్ల మధ్య వారిలో పల్లెల్లో 82 శాతానికి పైగా ఉన్నారని సమగ్ర వార్షిక మాడ్యులార్ సర్వే (సీఏఎంఎస్) వెల్లడించింది. నగరాల్లో ఈ వయసు వారు మరింత అధికంగా 92% ఉన్నారని తెలిపింది. 15-24 ఏళ్ల మధ్య వారిలో మొబైల్ ఫోన్ వాడుతున్న వారు గ్రామీణ ప్రాంతాల్లో 95.7% ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 97% మంది ఉన్నారని సర్వే గుర్తించింది.
2022 జులై నుంచి 2023 జూన్ మధ్య నిర్వహించిన సమగ్ర వార్షిక మాడ్యులార్ సర్వే (సీఏఎంఎస్) కీలక వివరాలను గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. జాతీయ శాంపుల్ సర్వే (ఎన్ఎస్ఎస్) 79వ రౌండ్లో ఈ సర్వే ఒక భాగమని తెలిపింది.