Published on Sep 27, 2024
Current Affairs
సెమీకండక్టర్‌ ప్లాంటుకు టాటా ఒప్పందం
సెమీకండక్టర్‌ ప్లాంటుకు టాటా ఒప్పందం

రూ.91,000 కోట్లతో గుజరాత్‌లోని ఢొలేరా వద్ద నిర్మించబోయే వేఫర్‌ ఫ్యాబ్‌ ప్లాంటుకు సంబంధించి తైవాన్‌ సంస్థ పవర్‌చిప్‌ సెమీకండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కార్పొరేషన్‌ (పీఎస్‌ఎమ్‌సీ)తో ఒప్పందం ఖరారైనట్లు టాటా ఎలక్ట్రానిక్స్‌ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం.. ప్రతిపాదిత ప్లాంటుకు డిజైన్, నిర్మాణ మద్దతును పీఎస్‌ఎమ్‌సీ అందిస్తుంది. దేశంలో ఏర్పాటవుతున్న తొలి ఏఐ ఆధారిత ఫ్యాబ్‌ ఇదే.