రూ.91,000 కోట్లతో గుజరాత్లోని ఢొలేరా వద్ద నిర్మించబోయే వేఫర్ ఫ్యాబ్ ప్లాంటుకు సంబంధించి తైవాన్ సంస్థ పవర్చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ (పీఎస్ఎమ్సీ)తో ఒప్పందం ఖరారైనట్లు టాటా ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం.. ప్రతిపాదిత ప్లాంటుకు డిజైన్, నిర్మాణ మద్దతును పీఎస్ఎమ్సీ అందిస్తుంది. దేశంలో ఏర్పాటవుతున్న తొలి ఏఐ ఆధారిత ఫ్యాబ్ ఇదే.