Published on Jan 24, 2025
Current Affairs
సుభాష్‌చంద్రబోస్‌ ఆపద ప్రబంధన్‌ పురస్కారం
సుభాష్‌చంద్రబోస్‌ ఆపద ప్రబంధన్‌ పురస్కారం

ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో నిస్వార్థంగా సేవ చేసిన సంస్థలు, వ్యక్తులకు కేంద్ర హోంశాఖ ప్రదానం చేసే ‘సుభాష్‌చంద్రబోస్‌ ఆపద ప్రబంధన్‌ పురస్కార్‌-2025’ హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌కు దక్కింది.

నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ఈ అవార్డును 2019 నుంచి ఏటా జనవరి 23న కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది.

ఈ అవార్డుకు ఎంపికైన సంస్థలకు రూ.51 లక్షల నగదు, ధ్రువపత్రం, వ్యక్తులకైతే రూ.5 లక్షల నగదు, ధ్రువపత్రం అందిస్తారు.

2025లో ఈ అవార్డు కోసం 297 నామినేషన్లు రాగా అందులో ఇన్‌కాయిస్‌ను కేంద్రం ఎంపిక చేసింది.