Published on Mar 3, 2025
Current Affairs
సెబీ ఛైర్మన్‌ బాధ్యతల స్వీకరణ
సెబీ ఛైర్మన్‌ బాధ్యతల స్వీకరణ

మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ 11వ ఛైర్మన్‌గా తుహిన్‌ కాంత పాండే 2025, మార్చి 1న బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పటి వరకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన్ను 2025, ఫిబ్రవరి 27న గురువారం సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. 

మిర్చి 1తో పదవీ కాలం పూర్తి చేసుకున్న మాధవి పురి బుచ్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.