రక్షణ రంగానికి సంబంధించి వాస్తవ జగతిలో తలెత్తగల సైబర్ ముప్పుల్ని అనుకరించి వాటికి దీటైన సమాధానం ఎలా ఇవ్వాలో తెలియజేస్తూ పరిష్కారం చూపే ‘సైబర్ సురక్షా’ కార్యక్రమం 2025, జూన్ 16న ప్రారంభమైందని రక్షణ శాఖ ప్రకటించింది. భారత సమగ్ర రక్షణ దళాల ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో రక్షణ శాఖ సైబర్ సంస్థ ఈ సైబర్ భద్రతా సమావేశం నిర్వహిస్తోంది. జూన్ 27న ఇది ముగుస్తుంది. రక్షణ, అనుబంధ రంగాలకు చెందిన జాతీయస్థాయి సంస్థల నుంచి 100 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.