కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) పరిధిలో ఉన్న 7,072 అవినీతి కేసుల విచారణ పలు కోర్టుల్లో పెండింగ్లో ఉందని కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది.
దీనిలో 379 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి.
2025, ఆగస్టు 31న విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. 2024, డిసెంబరు 31 నాటికి 1,506 కేసులు మూడేళ్లలోపు పెండింగ్లో ఉన్నాయి.
మూడేళ్ల నుంచి అయిదేళ్లలోపు 791 కేసులు, అయిదు నుంచి పదేళ్లలోపు 2,115 కేసులు పెండింగ్లో ఉన్నాయి.
పదేళ్లకు పైగా 2,281 కేసులు, 20 ఏళ్లకు పైగా 379 కేసులు పెండింగ్లో ఉన్నాయి.