కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన కేంద్రీయ మాధ్యమిక శిక్షా బోర్డు (సీబీఎస్ఈ) వివిధ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 124
వివరాలు:
1. అసిస్టెంట్ సెక్రటరీ: 08
2. అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్ (అకాడమిక్స్/ట్రైనింగ్/స్కిల్ ఎడ్యుకేషన్): 27
3. అకౌంట్స్ ఆఫీసర్: 02
4. సూపరింటెండెంట్: 27
5. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్: 09
6. జూనియర్ అకౌంటెంట్: 16
7. జూనియర్ అసిస్టెంట్: 35
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంఏ, ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: వివిధ విభాగాల్లోని పోస్టులను అనుసరించి 27 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్ఎం/మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. కానీ రూ.250 ప్రాసెసింగ్ ఫీజు తప్పనిసరి. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గ్రూప్-ఏ పోస్టులకు రూ.1750. గ్రూప్-బీ, సీ పోస్టులకు రూ.1050 ఫీజు ఉంటుంది. ఫీజును ఆన్లైన్ మోడ్లో మాత్రమే చెల్లించాలి.
ఎంపిక విధానం:
పోస్టుల గ్రూప్ను బట్టి ఎంపిక ప్రక్రియ మూడు అంచెలుగా ఉంటుంది:
టైర్-1: MCQ ఆధారిత ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్ష.
టైర్-2: ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ (రాత) ప్రధాన పరీక్ష.
టైర్-3: ఇంటర్వ్యూ/పర్సనల్ ఇంటరాక్షన్ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్ 22.
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 2025 డిసెంబర్ 22.