Published on Jun 17, 2025
Current Affairs
సిప్రి నివేదిక
సిప్రి నివేదిక

భారత్‌వద్ద 2025, జనవరి నాటికి 180 అణ్వాయుధాలు (అణు వార్‌హెడ్లు) ఉన్నాయని స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) నివేదిక వెల్లడించింది.

ఇవి పాకిస్థాన్‌వద్ద ఉన్న 172 కంటే ఎక్కువ.. చైనావద్ద ఉన్న 600 కంటే తక్కువని పేర్కొంది.

ఏడాదిలో భారత్‌ 8 వార్‌హెడ్లను పెంచుకుందని తెలిపింది.

ప్రపంచ దేశాలవద్ద అణ్వాయుధాలపై వార్షిక నివేదికను సిప్రి 2025, జూన్‌ 16న విడుదల చేసింది. 

చైనా ఏటా 100 అణు వార్‌హెడ్‌లను తన ఆయుధాగారంలోకి చేర్చుకుంటోందని నివేదిక పేర్కొంది.