Published on Mar 26, 2025
Current Affairs
సునీల్‌కు కాంస్యం
సునీల్‌కు కాంస్యం

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ సునీల్‌ కుమార్‌ కాంస్యం నెగ్గాడు. 2025, మార్చి 25న అమ్మాన్‌ (జోర్డాన్‌)లో జరిగిన గ్రీకో రోమన్‌ 87 కేజీల విభాగం కాంస్య పతక పోరులో అతడు 5-1తో జియాగ్జిన్‌ హంగ్‌ (చైనా)ను ఓడించాడు.

ప్రస్తుత ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. మొత్తంగా సునీల్‌కు ఇది అయిదో ఆసియా ఛాంపియన్‌షిప్‌ మెడల్‌.