సైనిక దళాల సుదీర్ఘ మోటార్ సైకిల్ యాత్ర 2025, మార్చి 10న అరుణాచల్ ప్రదేశ్లోని వ్యూహాత్మక ప్రాంతమైన చాంగ్లాంగ్ జిల్లా విజయ్ నగర్లో ప్రారంభమైంది.
3,900 కిలోమీటర్ల దూరం సాగనున్న ఈ శౌర్య యాత్ర గుజరాత్లోని రణ్ ఆఫ్ కచ్లో ముగియనుంది. ఐక్యత, సాహసం, దేశభక్తి పేరుతో ఈ యాత్ర సాగుతోంది.
ఈ యాత్రను విజయ్ నగర్లో నివసిస్తున్న 90 ఏళ్ల అస్సాం రైఫిల్స్ మాజీ ఉద్యోగి పదమ్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు.
ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్లో భాగంగా రక్షణ విభాగం ఈ యాత్రను నిర్వహిస్తోంది. యాత్రలో అస్సాం రైఫిల్స్, భారతీయ సైన్యం సిబ్బందితోపాటు అరుణాచల్ ప్రదేశ్కు చెందిన నలుగురు పౌరులు పాల్గొన్నారు.