ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను అంతక్రితం అంచనా అయిన 7.4% నుంచి 7.6 శాతానికి సవరించినట్లు ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. లెక్కింపు పద్ధతులను ప్రభుత్వం సవరించడం ఇందుకు నేపథ్యం. పార్లమెంటుకు జనవరిలో సమర్పించిన ఆర్థిక సర్వే ప్రకారం ఇది 6.8-7.2%.
గణాంక, పథకాల అమలు శాఖ (మోస్పి) 2026, ఫిబ్రవరి 27న ‘న్యూ సిరీస్ ఆఫ్ యాన్యువల్ అండ్ క్వార్టర్లీ నేషనల్ అకౌంట్స్ ఎస్టిమేట్స్’ను విడుదల చేసింది. అంతక్రితం ఉన్న పాత సిరీస్ను ఇది భర్తీ చేసింది. జీడీపీ సిరీస్కు ఇది తొమ్మిదో ప్రాతిపదిక సవరణ.