Published on Jun 11, 2025
Current Affairs
సతీశ్‌రెడ్డి
సతీశ్‌రెడ్డి

జాతీయ భద్రత సలహా మండలి సభ్యుడిగా డీఆర్‌డీఓ మాజీ ఛైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి 2025, జూన్‌ 10న నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో దీర్ఘకాల వ్యూహాత్మక సలహాలు అందించడానికి 1998 డిసెంబరులో ఈ మండలి ఏర్పాటైంది. ప్రస్తుతం రా మాజీ చీఫ్‌ అలోక్‌జోషి ఛైర్మన్‌గా పనిచేస్తున్న ఈ మండలిలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. తెలుగువారైన డి.బాలవెంకటేశ్‌వర్మ ఓ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు సతీశ్‌రెడ్డి ఏడో సభ్యుడిగా నియమితులయ్యారు.