త్రివిధ దళాల సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకుగాను ఇకపై అన్ని సర్వీసులకు ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్కు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అప్పగించారు.
ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏ విభాగానికి ఆ విభాగం ఆదేశాలు, సూచనలు జారీచేసే విధానానికి ఇది భిన్నం.
సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల మధ్య చక్కటి సమన్వయం, ఉమ్మడితత్వం పెంచడానికి ఏకీకృత నమూనాను (థియేటరైజేషన్ మోడల్) రూపొందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల నడుమ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మూడు సర్వీసులకు సీడీఎస్తోపాటు సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉమ్మడిగా సూచనలు, ఆదేశాలు జారీ చేస్తారని తెలిపింది.