Published on Mar 19, 2025
Current Affairs
సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ నివేదిక
సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ నివేదిక

దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా రాజధాని దిల్లీ మరోసారి నిలిచినట్లు సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ నివేదిక వెల్లడించింది.

2024-25 చలికాలంలో ఒక క్యూబిక్‌ మీటరుకు పీఎం 2.5 సాంద్రతతో 175 మైక్రోగ్రాముల కాలుష్య కారకాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. అయితే 2023-24 చలికాలంతో పోలిస్తే ఇది తక్కువేనని పేర్కొంది. 

ఈ జాబితాలో రెండో స్థానంలో కోల్‌కతా నిలిచింది. అక్కడ ఈ చలికాలంలో పీఎం 2.5 సాంద్రతతో క్యూబిక్‌ మీటరుకు 65 మైక్రోగ్రాముల కాలుష్యకారకాలు ఉన్నట్లు గుర్తించారు.