సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీఈటీ)కు నోటిఫికేషన్ విడుదల చేసింది. సీటెట్ పరీక్ష ఏటా రెండుసార్లు జరుగుతుంది. తాజాగా ఫిబ్రవరి-2026 ఏడాదికి సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) ఫిబ్రవరి-2026
పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి ఎనిమిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ దేశంలోని కేవీఎస్, ఎన్వీఎస్, సెంట్రల్ స్కూళ్లతో పాటు సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో, కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
అర్హతలు: ఇంటర్మీడియట్తో పాటు డీఈఎల్ఈడీ/ బీఈఎల్ఈడీ; డిగ్రీ డీఈడీ (ప్రత్యేక విద్య), బీఈడీ, బీఈడీ(ప్రత్యేక విద్య), / బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ, ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200(పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600(పేపర్ 1 & 2 రెండూ).
పరీక్ష విధానం: పేపర్-1 ఉదయం 9:30 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు పేపర్-2 మద్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
ముఖ్య తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.11.2025.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 18.12.2025.
ఫీజు చెల్లింపు చివరి తేది: 18.12.2025.
ఓఎమ్మార్ ఆధారిత పరీక్ష తేదీ: 08-02-2026.
పేపర్-1, పేపర్-2 ఎగ్జామ్ ప్యాటర్న్ల కోసం నోటిఫికేషన్లోని పేజీ నంబర్ 8 నుంచి చూడవచ్చు.
Website:https://ctet.nic.in/