సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఏటా అందించే సీబీఎస్ఈ - సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం సీబీఎస్ఈ దీన్ని అందిస్తోంది.
వివరాలు:
అర్హతలు: విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. విద్యార్థిని సీబీఎస్ఈలో పదోతరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలో పదకొండు తరగతి, పన్నెండో తరగతి చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షలో కనీసం 70శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు రూ.2500 కంటే మించకూడదు.
స్కాలర్షిప్ ఎంతంటే..: ఉపకారవేతనానికి ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ చేయించుకోవాలంటే, విద్యార్థిని కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.1000 చొప్పున అందిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08-02-2025.
సీబీఎస్ఈ పాఠశాలల దరఖాస్తు ధ్రువీకరణ తేదీలు: 15.02.2025.
Website:https://www.cbse.gov.in/cbsenew/scholar.html
Apply online:https://cbseit.in/cbse/2024/sgcx/default.aspx