డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న డి.కృష్ణ భాస్కర్ను రిలీవ్ చేసింది. బుద్ధప్రకాశ్ ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఈయన్ను సీఎండీగా నియమిస్తూ 2026, ఫిబ్రవరి 11న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.